కన్నడ పత్రికలో తెలంగాణ ఆవిర్భావ ప్రకటనలు.. ఏం వెలగబెట్టారని ప్రవీణ్ కుమార్ ఫైర్!

ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం పలు వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా పత్రికలలో కూడా భారీ భారీ ప్రకటనలు కూడా ప్రకటించారు. అంతేకాకుండా కన్నడ పత్రికలో కూడా ఏకంగా ఫ్రంట్ పేజీలో కేసీఆర్ ఫోటోతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం గురించి ప్రకటించారు.

దీంతో బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రకటనపై ఫైర్ అయ్యారు. ఏం వెలగబెట్టారని తెలంగాణ డబ్బులతో కర్ణాటకలో కోట్ల రూపాయల విలువ చేసే ఫ్రంట్ పేజీ ప్రకటనలు ఇచ్చారు అని గట్టిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో పింఛన్లు లేక అవ్వా తాతలు ఏడుస్తుంటే.. సంబంధం లేని రాష్ట్రంతో పత్రికలు ప్రకటనలు ఇస్తున్నారు అని మండిపడ్డారు.