జోరు పెంచిన ప్రబాస్: అయినా అదే గందరగోళం

ప్యాన్ ఇండియా స్టార్‌గా పాపులర్ అయిన ప్రబాస్ డైరీలో బోలెడన్ని ప్రాజెక్టులున్నాయి. అన్నీ ప్రెస్టీజియస్ అండ్ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్టులే. అన్నీ దాదాపు సెట్స్ మీదే ఉన్నాయి. రాధా క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’ దాదాపు షూటింగ్ చివరి స్థాయికి చేరుకుంది. రేపో మాపో రిలీజ్‌కి రెడీగా ఉంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘సలార్’ మూవీ కూడా ఏదో ఒక రకంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇకపోతే, మరో బిగ్ ప్రాజెక్టు ‘ఆది పురుష్’. నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకుడు. భారీ తారాగణంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రూపొందుతోన్న చిత్రమిది. బాలీవుడ్ నుండీ, టాలీవుడ్ నుండీ భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తోంది.

స్టేటస్ తెలియడం లేదు కానీ, ఈ సినిమాలోని ఒక్కొక్క పాత్రకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా సైలెంట్‌గా జరిగిపోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. అంటే, సైలెంట్‌గానే అయినా ఈ సినిమా కూడా పూర్తి కావస్త్తోందన్న మాటే. వీటితో పాటు మరిన్ని కొత్త ప్రాజెక్టులు కూడా ప్రబాస్ ఓకే చేస్తున్నారు.

చూస్తుంటే, ప్రబాస్ జెట్ స్పీడులో ఉన్నాడనిపిస్తోంది. కానీ, ఏ ఏ సినిమాలు ఏ ఏ స్టేటస్‌ల్లో ఉన్నాయనేది మాత్రం తెలియక ఫ్యాన్స్‌లో కాస్త గందరగోళం నెలకొంది. ఈ గందరగోళాన్ని బాహుబలి ఎలా తీరుస్తాడో చూడాలి మరి.