సంచలన దర్శకుడితో ప్రభాస్ భారీ సినిమా ఫిక్స్!

ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ తన కెరీర్ లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 25వ సినిమా కోసం క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.

మరి దీనిపై రేపు అక్టోబర్ 7వ తేదీన ఒక క్లారిటీ రాబోతున్నట్టుగా సమాచారం ఉంది. కానీ మరి ప్రభాస్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయినటివంటి దీనిని ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అంటే దానికి సమాధానం వినిపిస్తుంది.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేపి ఇదే సినిమాని హిందీలో తీసి మొట్టమొదటి సారిగా పక్కా ‘ఏ’ సర్టిఫికెట్ తో 300 కోట్లు వసూళ్లు కొల్లగొట్టిన సంచలన దర్శకుడు సందీప్ వంగతో అట.

ఏ తరహా సినిమా ఉంటుంది అన్నది తెలియరాలేదు కానీ. రేపు మాత్రం అనౌన్స్ అయ్యేది ఈ దర్శకుడి పేరే అట. ఒకవేళ ఇదే నిజం అయితే వీరి మాస్ ఎలా ఉంటుందో చూడాలి.