అభిమానులకి మరింత దగ్గర కానున్న ప్రభాస్.. మొదటిసారిగా అందులోకి ఎంట్రీ…?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈశ్వర్ సినిమా ద్వారా ప్రభాస్ మొదటిసారిగా హీరోగా పరిచయమయ్యాడు. తాజాగా ఈ సినిమా 20 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా ప్రేక్షకులలో ప్రభాస్ కు ఉన్న క్రేజీ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు బిల్లా మిర్చి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ప్రభాస్ బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసింది. ఈ సినిమా తర్వాత వస్తున్న ప్రభాస్ ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ రేంజ్ లో విడుదలవుతున్నాయి.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో రాధే శ్యామ్ వంటి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై కొంత నిరాశపరిచాయి. ఇదిలా ఉండగా ప్రభాస్ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మొన్నటి వరకు పేస్ బుక్ లో మాత్రమే కనిపించిన ప్రభాస్ కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు. అయితే ఈ సోషల్ మీడియాలో అకౌంట్స్ లో ప్రభాస్ కి లక్షల సంఖ్యలో ఫాలోయింగ్ ఉంది. తాజాగా ప్రభాస్ సోషల్ మీడియా ద్వారాతన అభిమానులకు మరింత చేరువ కానున్నాడని తెలుస్తోంది.

ఇప్పటివరకూ ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లలో యాక్టివ్ గా ఉండే ప్రభాస్ త్వరలోనే ప్రభాస్ ట్విట్టర్ లోకి అడుగు పెట్టనున్నడని వార్తలు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ డమ్ ఉండటంతో ప్రభాస్ ట్విట్టర్ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ త్వరలో ట్విట్టర్ అకౌంట్ ను క్రియేట్ చేయనున్నారని.. అతి త్వరలోనే ప్రభాస్ మొదటి ట్వీట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం . ఇక ప్రభాస్ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. అంతే కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే సినిమా చేస్తున్నాడు. అదే విధంగా సందీప్ వంగ డైరెక్షన్లో స్పిరిట్, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే వరుస సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .