ఇమాన్యుయేల్ చేసిన పనికి వాంతులు చేసుకున్న వర్ష.. పూర్ణ పై ఫైర్ అయిన ఇమాన్యుయేల్ ?

బుల్లితెర ప్రసారమయ్యే కార్యక్రమాలను ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది ఇకపోతే గతవారం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి నటి ఇంద్రజ హీరోయిన్ పూర్ణ ఎంట్రీ ఇచ్చారు. పూర్ణ ఎంట్రీ ఇవ్వడంతోనే ఎంతోమంది కంటెస్టెంట్ మా బుగ్గ కొరకండి అంటూ తన వెంట పడ్డారు. గతంలో ఈమె ఢీఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన సమయంలో కంటెస్టెంట్ కొడుకు దారుణంగా ట్రోలింగ్ గురయ్యారు.

ఇకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేసిన పూర్ణ ఇమ్మానియేల్ ను దారుణంగా అవమానపరిచింది. ఇమ్మానియేల్ దగ్గరికి వచ్చి కూర్చోగానే స్నానం చేయలేదా ఇంత కంపు కొడుతుంది అంటూ మాట్లాడటంతో ఇమ్మానియేల్ ఎంతో అవమానంగా ఫీల్ అవుతారు. ఇదివరకు వాళ్ళందరూ వచ్చిన రాని కంపు నువ్వు వస్తేనే వస్తోంది అంటూ పూర్ణ అతని పరువు మొత్తం తీసింది. పూర్ణ ఇలా అనేసరికి ఇమ్మానియేల్ ను ఎవరూ కూడా వారి టీంలోకి తీసుకోకుండా అందరూ తనని దూరం పెడతారు.

ఈ క్రమంలోనే ఇమ్మానియేల్ వర్ష దగ్గరకు వెళ్లగా ఆమె కంపుకొడుతున్నావు అంటూ వాంతి చేసుకున్నట్లు నటిస్తుంది. వర్షను అలా చూసిన ఇమ్మానియేల్ మాట్లాడుతూ…నువ్వు మరి అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు వాళ్ళు నిన్ను ఏదో చేశారనుకుంటారు అంటూ తన పై పంచ్ వేసాడు. ఇమ్మానియేల్ ఇలా అనేసరికి వర్ష తెల్లమొహం వేసుకుంటుంది.ఇక పూర్ణ అన్న మాటకు తనని ఎవరు దగ్గరకు రానివ్వకపోవడంతో ఇమ్మానియేల్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదంతా కేవలం మీరు చేసిన పని వల్లే అంటూ హీరోయిన్ పూర్ణ పై చిందులు వేస్తాడు.