ప్రజల పట్ల పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు: బండి సంజయ్

తాజాగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరిట పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు అని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన అన్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మహిళల పై పోలీసులు దాడి చేశారు అని మండిపడ్డారు.

ఇక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా.. నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యలను నాన్చుతూ కాలక్షేపం చేయడం అన్యాయమని అన్నారు. ఇక అర్ధరాత్రి పూట పోలీసులు ప్రజల పై దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది అని.. ఈ విషయం గురించి కేసీఆర్ స్పందించాలి అని అన్నారు. ఇక వారిని పూర్తిగా ఆదుకున్న తర్వాతే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి అని అన్నారు.