Crime News: పరాయి మహిళపై భర్త అత్యాచారం.. విషయం తెలిసిన నిందితుడు భార్య ఏం చేసిందో తెలుసా?

Crime News: ప్రపంచంలో ఏ ఆడదైనా భర్త పరాయి మహిళ వైపు కన్నెత్తి చూసినా కూడా ఒర్చుకోలేదు. కానీ విజయవాడలో మాత్రం ఒక మహిళ తన భర్త పరాయి మహిళపై అత్యాచారం చేసిన కూడా ఆ నీచాన్ని మొత్తం వీడియో తీసి ఆనందించింది. వివరాలలోకి వెళితే విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌
ప్రాంతంలో దిలీప్, తులసి అనే దంపతులు  ఉంటున్నారు. వారికి ఎదురింట్లో ఒక వివాహిత కుటుంబంతో కలిసి నివసిస్తోంది. బాధితురాలి భర్త కేటరింగ్ పనులు చేస్తూ ఉంటాడు.

కేటరింగ్ పనులు నిమిత్తం బాధితురాలి భర్త వేరే ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. ఇటీవల పని నిమిత్తం భర్త వేరే ప్రదేశానికి వెళ్ళతంతో ఈ నెల 3 వ తేదీన బాధితురాలు తన ఇద్దరి పిల్లలతో కలిసి తన ఇంట్లో నిద్రించింది. దిలీప్ ఎదురింట్లో ఉన్న ఆమె మీద కన్ను వేసి ఆమె భర్త ఇంట్లో లేని సమయం కోసం ఎదురు చూసాడు. ఈ నెల 3 వ తేదీన ఆమె భర్త లేకపోవడంతో దిలీప్ అతని భార్య కలిసి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. చుట్టుపక్కల వారు వినకుండా ఆమె నోరు మూసి బలవంతంగా తమ ఇంట్లో కి తీసుకెల్లి ఆమెపై దిలీప్ రెండు సార్లు అత్యాచార ప్రయత్నం చేశాడు.

భర్త ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతున్న అడ్డుకోకుండా తులసి తన భర్త చేసిన పనిని ఫోటోలు, వీడియోలు తీసింది. మరుసటి రోజు కూడా దిలీప్ ఆమెపై అత్యాచారం చేసి ఈ విషయం ఎవరికైనా చెబితే తమ పిల్లల్ని చంపి ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దిలీప్ ఇంకా దిగజారిపోయి తన స్నేహితులతో కూడా గడపాలని లేకపోతే ఫోటోలు బయటపెడతానని ఆమెను బెదిరించాడు. బాధితురాలు వేధింపులు భరించలేక వారి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని
376(2), 354బి, 354డి, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.