జూబ్లీహిల్స్ ఘటనలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ఇటీవలే జూబ్లీహిల్స్ లో ఓ బాలికపై అత్యాచార ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఇప్పటికీ కేసీఆర్ ఈ ఘటన గురించి స్పందించడం లేదు అని మండిపడ్డారు. కాగా పోలీసులు కూడా ఈ ఘటనపై చేపట్టడం లేదు అన్నారు.

దీంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరో ముగ్గురు నిందితులను పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. ఉమర్ ఖాన్ తో పాటు ఇద్దరు మైనర్ లను కర్ణాటకలో అరెస్టు చేసినట్లు వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.