Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈనెల 24వ తేదీన విడుదల కానున్న సందర్భంగా మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అన్న విషయానికి వస్తే.. హరిహర వీరమల్లు సినిమా క్రిష్గారి వల్ల నా దగ్గరకు వచ్చింది. వ్యక్తిగత, వృత్తి పరమైన కారణాల వల్ల ఆయన మధ్యలో వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆయన తర్వాత జ్యోతికృష్ణ ఈ సినిమాను హ్యాండిల్ చేశారు. ఇక నేను డిప్యూటీని సీయంని కావచ్చు. కానీ ఈ సినిమాకు హీరోని. నిధీ అగర్వాల్ గారు యాక్టివ్ గా ఈ సినిమా ప్రమోషన్ చేయడం చూసి, సిగ్గు తెచ్చుకుని నేను మీడియా ఇంట్రాక్షన్ లో పాల్గొంటున్నాను అని హీరో పవన్ కల్యాణ్ అన్నారు.
అయితే ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. దాదాపుగా ఐదేళ్ల నుంచి ఊరిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది.
Pawan Kalyan: నిధి అగర్వాల్ ని చూసి సిగ్గు తెచ్చుకొని ప్రమోషన్స్లో పాల్గొంటున్నాను: పవన్ కల్యాణ్
