Jr.NTR: కరోనా మహమ్మారి దండయాత్రను కొనసాగిస్తూనే ఉంది. దేశంలో రోజు రోజుకు కొత్త కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ మూడో వేవ్ లో ఎక్కువగా సెలబ్రెటీలు కరోనా భారిన పడటం వింతగా ఉంది. పేర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఈ రోజు సరిపోదు. నిన్న నారా లోకేష్ కి, ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కరోనా సోకింది. తనకు స్వల్ప లక్షణాలతో కూడిన కరోనా ఉన్నట్లుగా బాబు గారు ఈ రోజు ఉదయం ట్విట్ చేశారు.
ఇక ఆ విషయం తెలిసినప్పటి నుండి టీడీపీ, బాబు గారి అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తూ ట్విట్స్ చేశారు. అయితే ఈ వ్యవహారంలోకి జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చి నానా హడావిడి చేశారు. విషయమేంటంటే… గతంలో ఎన్టీఆర్ కు కరోనా సోకినప్పుడు చంద్రబాబు ట్విట్టర్ లో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని విష్ చేశారు. ఆ సంగతిని గుర్తు చేస్తూ ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చిందని, కృతజ్ఞత చూపించాలని ట్విట్టర్ లో తెగ హంగామా చేశారు.
హద్దులు దాటుతున్న ఫాన్స్ హడావిడికి పుల్ స్టాప్ పెడుతూ కొద్దిసేపటి క్రితం యంగ్ టైగర్, బాబు గారిని విష్ చేశారు. “మావయ్య చంద్రబాబు గారు, లోకేష్ త్వరగా కోలుకోవాలని” తన ట్విట్టర్ ఖాతాలో ట్విట్ చేశాడు ఎన్టీఆర్. దీంతో అభిమానులు చల్లబడి ఆ ట్విట్ ని రీట్వీట్ చేస్తూ, షేర్ చేస్తున్నారు. అంతేకాదండోయ్… బాబు గారిని ఎన్టీఆర్ ‘మావయ్య’ అని సంభోధించటంతో నారా, నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
Wishing you Mavayya @ncbn garu and @naralokesh a speedy recovery. Get well soon! https://t.co/cygw7hmARc
— Jr NTR (@tarak9999) January 18, 2022