‎NTR: పెన్సిల్ స్కెచ్ తో ఎన్టీఆర్ బొమ్మను గీసిన అమ్మాయి.. ఎంతకు అమ్ముడుపోయిందో తెలిస్తే షాకవ్వడం ఖాయం!

‎NTR: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ సినిమాలు తీస్తున్నారు.

‎ఇటీవల వార్ 2 అనే బాలీవుడ్ సినిమాతో వచ్చి పర్వాలేదని అనిపించారు. వార్ 2 సమయంలో ఎన్టీఆర్ బాగా వైరల్ అయ్యారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్,ఆయన ఫ్యాన్స్ వైరల్ అవుతున్నారు. ఒక స్కెచ్ ఆర్టిస్ట్ గీసిన ఎన్టీఆర్ బొమ్మను ఫ్యాన్స్ భారీ ధరకు కొనుగోలు చేశారు. బ్యులా రూబీ అనే తెలుగు అమ్మాయి పెన్సిల్స్ తో స్కెచ్ ఆర్ట్ లు గీస్తూ ఉంటుంది. వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసి అమ్ముతూ ఉంటుంది. లేదా ఎవరికైనా తన స్కెచ్ లు నచ్చితే కొనుక్కుంటారు. తను సినిమా హీరోలు, సెలబ్రిటీల స్కెచ్ లు గీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల బ్యులా రూబీ పెన్సిల్ తో ఎన్టీఆర్ స్కెచ్ గీసింది.



‎ఈ ఫోటో వైరల్ అవ్వడంతో ఒక ఎన్టీఆర్ అభిమాని అమెరికా నుంచి తనకు మెసేజ్ చేసి దాన్ని కొనుక్కున్నాడు. ఈ విషయాన్ని బ్యులా రూబీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇదే విషయాన్ని బ్యులా రూబీ ఈ విషయాన్ని తెలియచేస్తూ.. ఇప్పటివరకు నేను గీసిన తెలుగు హీరోలకు సంబంధించిన పెన్సిల్ ఆర్ట్ లో ఎన్టీఆర్ ఆర్ట్ ఎక్కువ రేటుకు అమ్ముడయింది. ఒక వ్యక్తి నాకు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి దీన్ని కొనుక్కున్నాడు. 1650 డాలర్లు అనగా లక్ష 45 వేల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. నేను గీసిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. నా పెన్సిల్ ఆర్ట్ ఇంతకు అమ్ముడవుతుందని నేను అనుకోలేదు అంటూ తెలిపింది. దీంతో ఈ ఆర్ట్ వైరల్ అవ్వగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్కెచ్ అదిరింది అంటూ అభినందిస్తున్నారు.