Balakrishna: బాలయ్య అన్ స్టాపబుల్ కార్యక్రమానికి తారక్ రాకపోవడానికి కారణం ఇదే!

Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా కోసం తన కెరీర్ లో మొదటి సారిగా హోస్ట్ గా అవతారం ఎత్తిన విషయం అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను బాలకృష్ణ తనదైన శైలిలో అలరిస్తున్నాడు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె. ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఊహించని విధంగా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ తెచ్చి పెట్టాడు బాలయ్య బాబు. ఇప్పటివరకు వెండితెరపై డైలాగ్స్ తో, నటనతో వెండితెర ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేశాడు.

ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించి బాలకృష్ణ నిజంగానే అన్ స్టాపబుల్, బాలయ్య బాబు ని నిజంగానే ఎవరు ఆపలేరు అని నిరూపించే చేశాడు. బాలయ్య హోస్ట్ గా చేసిన ఈషో టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. అయితే ఇక త్వరలోనే ఈ మొదటి సీజన్ ముగియనుంది. ఇప్పటికే షో నిర్వాహకులు రెండవ సీజన్ కు కూడా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే విధంగా గతంలో కూడా సమంతతో కలిసి సామ్ జామ్ అన్న షోని నడిపించారు. అది క్లిక్ అవకపోవడంతో రెండవ సీజన్ మొదలు పెట్టలేదు. ఇంకా అన్ స్టాపబుల్ షోకి చివరి గెస్ట్ గా టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు రాబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ షోకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై అన్ స్టాపబుల్ షో రైటర్ అయిన బి.వి.ఎస్.రవి క్లారిటీ ఇచ్చారు. ఈ షోలో కేవలం కొంతమంది వ్యక్తులను మాత్రమే మేము ముందుగా ప్లాన్ ప్రకారం చేసుకున్నామని, మిగిలిన కొంతమంది వారి డేట్స్ అనుకూలంగా లేకపోవడంతో వారిని ఈ షోకి ఇన్వైట్ చేయలేకపోయాము అని తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్ వంటి హీరోలు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో రాలేకపోయారని.. ఇక ఈ షోకి ఎన్టీఆర్ ను ఇన్వైట్ చేయాలి అనుకున్న సమయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఇక బాలయ్య మీద ఉన్న గౌరవం తో ఆ టీమ్ నుంచి రాజమౌళి, కీరవాణి గారు రావడం జరిగింది అని తెలియజేశాడు.