పుష్ప లాగే ఎన్టీఆర్, కొరటాల సినిమా?

కొరటాల శివ టాలీవుడ్ లో ఒక అగ్ర దర్శకుడు. ఇండస్ట్రీ కి దర్శకుడిగా పరిచయమయ్యి దాదాపు పదేళ్లు కావస్తున్నా దర్శకత్వం వహించింది కేవలం నాలుగు సినిమాలు మాత్రమే. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనత గ్యారేజ్’, ‘భారత్ అనే నేను’ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల, ఎవ్వరూ ఊహించని విధంగా ‘ఆచార్య’ లాంటి భారీ ప్లాప్ ఇచ్చారు. ఈ ప్లాప్ తో కొరటాల చాలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది.

ఎన్టీఆర్ లో చాలా కలం క్రితమే ఒక సినిమా అనౌన్స్ చేసారు. ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాలి కానీ ఇంకా ఆలస్యం అవుతూ వస్తుంది. తాను రాసుకున్న స్క్రిప్ట్ ఓ కొలిక్కి రావడం లేదు. అలాగే ఆ కథలో కొన్ని లోపాలు ఉండడంతో కొరటాల వాటిని సరిచేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. కానీ కథ ఆశించినట్లుగా రావడం లేదట. దీనితో కొరటాల ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది.

ఇప్పుడు తాజాగా ఒక  ఇంట్రెస్టింగ్ పాయింట్ తో కొత్త కథ రాసుకునే పనిలో ఉన్నారట కొరటాల. నవంబర్ కల్లా కథ పూర్తి చేయాలని కొరటాల ట్రై చేస్తున్నారు. కొరటాల శివ రాస్తున్న ఈ న్యూ స్టోరీ చాలా ఇంటరెస్టింగ్ గా ఉండబోతున్నట్లు ఓ న్యూస్ వచ్చింది.  భారీ ఓడలు, సముద్రాలపై జరిగే స్మగ్లింగ్ ఈ తరహాలో ఎన్టీఆర్, కొరటాల చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పుష్ప తరహాలోనే ఈ సినిమా కూడా స్మగ్లింగ్ నేపధ్యం లో సాగుంతోంది కానీ, ఈ సినిమా సముద్రం లో ఉంటుందంట. ఇంతకముందు ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో ‘జనతా గ్యారేజ్’ సూపర్ఆ హిట్ అయ్యింది.  కొరటాల సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది