తనను ఆపే శక్తి ఎవరికీ లేదంటున్న తమిళిసై..

తాజాగా గవర్నర్ తమిళ సై మహిళా దర్బారును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ కొన్ని విషయాలు పంచుకుంది. తనను ఆపే శక్తి ఎవరికీ లేదని.. తెలంగాణ ప్రజల కోసం తను పని చేస్తున్నాను అని తెలిపింది. తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని పట్టించుకోను అంటూ.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూస్తే గుండె పగిలిపోతుంది అని అన్నారు.

ఇక తనేమి తన కోసం పోరాటం చేయడం లేదు అని.. మహిళలను ఆదుకోవడానికి తాను ఎప్పుడు ఉంటాను అని.. మహిళల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తాను అని అన్నారు. ఇక మహిళ దర్బార్ వెనుక ఎలాంటి రాజకీయం లేదు అని.. మహిళా దర్బార్ ను భవిష్యత్తులో కొనసాగిస్తాను అని.. తమ గెలుపును ఎవరు ఆపలేరు అని తెలిపారు.