కేంద్ర మంత్రికి కరోనా !

Nithin Gadkari

దేశంలో COVID-19 కేసుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. పేదలు ధనవంతులు అని తేడా లేకుండా అందరికి అంటుకుంటుంది. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంతకుముందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా COVID-19 పాజిటివ్ వచ్చింది. చికిత్స తర్వాత దాని నుండి అమిత్ షా కోలుకున్నారు. వీళ్ళే కాకుండా , రాజ్యసభకు చెందిన ఎనిమిది మంది సభ్యులు, లోక్‌సభకు చెందిన పదిహేడు మంది సభ్యులకు కూడా వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు.

Nithin Gadkari

నితిన్ గడ్కరీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తనకు సోకిన COVID-19 పాజిటివ్ గురించి ప్రకటించారు. అతను వ్రాస్తూ, “నిన్న, నేను బలహీనంగా ఉన్నాను మరియు నా వైద్యుడిని సంప్రదించాను. పరీక్షిస్తే , నేను COVID 19 పాజిటివ్ అని చెప్పారు. నేను ప్రస్తుతం అందరి ఆశీస్సులు బాగానే వున్నాను . నన్ను నేను క్వారంటైన్ చేసుకున్నాను. తన పరిచయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మరియు భద్రతా ప్రోటోకాల్‌ను అనుసరించాలని” కోరారు. తెలుగురాజ్యం తరఫున అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.