Suicide: ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వధువు దారుణం.. భర్త లేని సమయంలో..!

Suicide: ఈ మధ్య కాలంలో పిల్లలకి ఊహా తెలిసినప్పటి నుండి వారికి ఇష్టమైన పనులు చేస్తూ పిల్లలని గారాబంగా పెంచుతున్నారు. వయసు పెరిగే కొద్ది పిల్లలో మార్పు రావడం లేదు..వారు కోరుకున్నవి దక్కకపోయిన, వారికి ఇష్టం లేని పని చేసిన క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇలాంటి విషాదకరమైన సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి జరిగి కాళ్ళ పారాణి అరకముందే చేతులారా జీవితాన్ని ముగించేదుకుంది.

వివరాలలోకి వెళితే…వరంగల్‌ జిల్లా, చెన్నరావుపేట మండలం, లింగగిరికి చెందిన ఏకాంతం అనే వ్యక్తికి ఒక కూతురు. చాలా సంవత్సరల క్రితం నగరానికి వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేసుకుంటూ చర్లపల్లి, ఈసీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. కూతురు శైలజ పెల్లీడుకి రావటంతో ఏకాంతం మేనల్లుడు సతీష్ కి కూతురు శైలజ ను ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన వారానికి నూతన దంపతులతో పాటు శైలజ తల్లి కూడా ఈసినగర్ లో సతీష్ ఉంటున్న ఇంటికి వచ్చారు.

ఇదిలాఉండగా..బుధవారం ఉదయం సతీష్‌ ఇంట్లో లేని సమయంలో తల్లి ఉన్న రూంకు గడియ పెట్టి హాల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శైలజ ఆత్మహత్యకు పాల్పడింది. తన రూమ్ బయట గడియ పెట్టిన విషయాన్ని భర్త, బంధువులకు శైలజ తల్లి తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో శైలజా తల్లి చెప్పిన వివరాల ప్రకారం ఇష్టం లేని పెళ్లి చేసినందువల్ల తమ కూతురు ఇలా ప్రాణాలు తీసుకుందని ఆమె విలపించారు.