Crime News: మరిది పై మోజు పడిన నవ వధువు.. భర్తను మోసం చేసి మరిదితో కలిసి పరార్..!

Crime News: సమాజంలో జరిగే కొన్ని విచిత్రమైన సంఘటనలను చూస్తుంటే ప్రపంచం అంతమైపోతుందేమో అన్న ఆలోచన వస్తుంది. మనుషులు మరి బరితెగించి పోతున్నారు. అందుకు నిదర్శనం ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన. ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో వివాహబంధానికి ప్రాముఖ్యత ఎక్కువ. కానీ ప్రస్తుత కాలంలో పెళ్లికి అసలు విలువ ఇవ్వటం లేదు. ఉత్తరప్రదేశ్ లో పెళ్లి జరిగిన రెండు రోజులకి ఒక మహిళ మరి దీనిపై మనసు పారేసుకుని భర్తని మోసం చేసి పారిపోయింది.

వివరాలలోకి వెళితే… ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని పురాన్‌పూర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి పిలిభిత్‌కు చెందిన యువతితో కొంతకాలం క్రితం వివాహమైంది. వివాహం తర్వాత ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగు పెట్టిన కొత్త కోడలు అందరితో కలిసి మెలిసి ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ పెళ్లి అయిన 20 రోజులకే ఆమె దుర్బుద్ధి ని బయట పెట్టింది. అత్తింటి వారు కోడలి గురించి పూర్తిగా తెలియక కలిసిమెలిసి ఉంటుంది అని పొరపాటు పడ్డారు.

పెళ్లి జరిగిన రెండు రోజులకే మరిది వరుస అయ్యే వ్యక్తి మీద మనసు పారేసుకుంది అని పాపం వారికి తెలియక మంచి అణకువగా ఉండే కోడలు కోడలు దొరికిందని సంబరపడ్డరు. వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. భర్థని, అత్త మామల ను మోసం చేసి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు తీసుకుని ఇంటినుండి పారిపోయింది. కోడలు కనిపించకపోవడం తో అందరూ కంగారు పడ్డారు. కానీ ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు కూడా కనిపించకపోవడం తో వెంటనే బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు. కానీ తర్వాత తమ కోడలు మరిదితో కలిసి పారిపోయింది అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.