ఆమె గెలవటం నేనూ ఒప్పుకోను అంటూ బిందూ గురించి నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

ఓటీటీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఒక్కరోజులో ఈ నాన్ స్టాప్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. అయితే ఈ నాన్ స్టాప్ సీజన్ లో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన 11 వారంలో బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడు. హౌస్ లోకి వెళ్లిన సమయం నుండి టైటిల్ గెలవాలని ఎన్నో కలలు కన్న నటరాజ్ మాస్టర్ చివరకు టాప్ 5 వరకు చెరుకోక ముందే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.

నటరాజ్ మాస్టర్, బిందూ మాధవి గొడవ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరికీ అస్సలు పడదు. బిందు మాధవితో జరిగిన గొడవ కారణంగా నటరాజ్ మాస్టర్ విమర్శలు ఎదుర్కోని ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో నటరాజ్ మాస్టర్ టైటిల్ విన్నర్ గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. ఈ బిగ్ బాస్ నాన్స్టాప్ సీజన్ టైటిల్ విన్నర్ బిందు మాధవి అసలు కాకూడదు. బిందూ టైటిల్ గిలిస్తే పెయిడ్ మీడియా గెలిచినట్టు అర్థం ఎందుకంటే ఆమే బయట డబ్బులిచ్చి పబ్లిసిటీ చేయించుకొని ఓట్లు వేయించుకుంది.

ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో నటరాజ్ మాష్టర్ దేవుడితో మాట్లాడిన విషయం గురించి కూడా వివరించాడు. ” నేనూ ఇంట్లో అలా చేయను. బిగ్ బాస్ హౌస్ లో అందరు నాకు వెన్నుపోటు పొడిచి ద్రోహం చేశారు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలీక అలా చేశాను. నేనూ అలా ఎందుకు చేయవలసి వచ్చిందో బిగ్ బాస్ కి చెప్పే అవకాశం ఆయన ఇవ్వలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. బిందుకి టైటిల్ గెలవటానికి అర్హత లేదు. అఖిల్ టైటిల్ గెలిస్తే బాగుంటుంది. అఖిల్ ఎంతో కష్టపడి గేమ్ ఆడాడు. ఇక సెకండ్ ప్లేస్ లో బాబా భాస్కర్ మాస్టర్ ఉంటే చాలా బాగుంటుంది. అంటూ.. నటరాజ్ మాష్టర్ చెప్పుకొచ్చారు.