చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేరు : నారా లోకేశ్

why nara lokesh is getting frustration

అమరావతి ప్రాంతంలో అసైన్డ్‌ భూముల క్ర‌య‌, విక్ర‌యాల‌కు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషినల్‌ డీజీపీకి ఫిర్యాదు చేయ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడికి అధికారులు నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నోటీసుల‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్.. చంద్ర‌బాబు నాయుడిని ఏమీ చేయ‌లేర‌ని చెప్పారు.

lokesh slams jagan

‘తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని నమ్మించడానికి వైఎస్ జ‌గ‌న్ పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు?’ అని లోకేశ్ నిల‌దీశారు. ’21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు. సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు. అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది’ అని నారా లోకేశ్ ట్వీట్లు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 23న ఆయన విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయానికి రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చంద్రబాబుపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి. ఐతే గతంలో వచ్చిన ఇన్ సైడర్ ట్రైడింగ్ కేసు కాకుండా.. కొత్తగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ అయ్యాయి.