Namrata Shirodkar: తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసిన నమ్రత..!

Namrata Shirodkar: ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత మహేష్ బాబుని పెళ్లాడి ఆయన భార్యగా చక్కగా బాధ్యతలు నిర్వహిస్తోంది. మహేష్ బాబు సినిమాలకు సంభందించిన ప్రతి విషయం నమ్రత దగ్గరుండి మరీ చూసుకుంటారు. మహేష్ బాబు,నమ్రత కలిసి
బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమాలో నటించారు. మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత సినిమాలకి దూరంగా ఉంటూ ఆయన భార్యగా, పిల్లలకి తల్లిగా, చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నమ్రత ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా నమ్రత సోషల్ మీడియా ద్వారా చేసిన ఒక పోస్ట్ ఫస్ట్ బాగా వైరల్ అయ్యింది. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి బాగా ఎమోషనల్ అయ్యింది. ఏ కూతురు కైనా తన తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత అమ్మాయిలు తల్లిదండ్రులను ఎంతగానో మిస్ అవుతారు.

నమ్రత తన తండ్రి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..” గత 16 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాను.. ఇన్ని సంవత్సరాల నుండి మీరు నా వెనక నిలబడి నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను నడిపించారు. నా హృదయంలో మీ స్థానం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మీరు ఎక్కడున్నా మీ కూతురిని చూసి గర్వంగా ఫీల్ అవుతారని అనుకుంటున్నా”. అంటూ నమ్రత తన తండ్రి పుట్టిన రోజున ఎంతో ఎమోషనల్ అయ్యింది. నమ్రతకు తన తండ్రి అంటే ఎంతో ప్రేమ.నమ్రత తండ్రి గత కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. సోషల్ మీడియా ద్వారా నమ్రత చేసిన పోస్టుకు ఉత్తమ కూతురు అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.