కేసీఆర్‌ను కలిసిన చిరు, నాగ్.. కారణం అదేనా?

సినీ ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాన్ని కలవడం, బాలకృష్ణ ఆ మీటింగ్‌పై సంచలన కామెంట్స్ చేయడం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. షూటింగ్‌ల అనుమతి కోసం చిరంజీవి, నాగార్జున ఇంకొంతమంది పెద్దలు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ మీటింగ్‌కు బాలయ్యను పిలవకపోవడం పెద్ద రచ్చగా మారింది. వారంతా భూములు పంచుకుంటున్నారేమో అని బాలయ్య దారుణమైన కామెంట్లు చేశాడు.

Nagarjuna And Chiranjeevi Met CM KCR To Give Cheque For Hyderabad Floods
Nagarjuna And Chiranjeevi Met CM KCR To Give Cheque For Hyderabad Floods

ఆ తరువాత మళ్లీ చిరంజీవి ప్రభుత్వంతో చర్చలు జరపలేదు. కానీ మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి, నాగార్జున సీఎం కేసీఆర్‌ను కలిశారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకు కలిసి ఉంటారని నెటిజన్లు కూడా ఆరాలు తీస్తున్నారు. అసలు విషయమేంటో సరిగ్గా బయటకు రాకపోయినా ఓ సంగతి మాత్రం చక్కర్లు కొడుతోంది. తాజాగా హైద్రాబాద్‌లో వరదలు ఏ రేంజ్‌లో బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే.

Nagarjuna And Chiranjeevi Met CM KCR To Give Cheque For Hyderabad Floods
Nagarjuna And Chiranjeevi Met CM KCR To Give Cheque For Hyderabad Floods

హైద్రాబాద్ వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వ నిధికి సినీ తారలు విరాళాలు అందించారు. నాగార్జున యాభై లక్షలు, చిరంజీవి కోటి రూపాయలు సీఎం నిధికి విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన చెక్కులను అందించడానికే కేసీఆర్‌ను కలిశారని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి.