Crime News: సీమంతం చేసి కూతురిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చిన తల్లి తండ్రులు.. కానీ కూతురు అలా కనిపించడంతో షాక్ …!

Crime News : ఈ రోజుల్లో యువత ప్రేమ పేరుతో మోసపోతున్నారు. పెద్దలను ఎదురించి ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని కష్టాల పాలవుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన బొలంగీర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటినుండి అత్తవారింటి వారు వరకట్నం కోసం వేదించేవారు. చివరికి గర్భవతి అని కనికరం కూడా లేకుండా దారుణానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే…బొలంగీర్‌ జిల్లా సదర్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని టలయుద్ర గ్రామంలో ఆదివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.. వనకా బిహారీ గ్రామానికి చెందిన పుష్పాంజలి ప్రధాన్‌ అనే యువతి అదే గ్రామానికి చెందిన బిపిన్‌ ప్రధాన్‌ అనే యువకుడు ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగు పెట్టిన ఆశలన్నీ నిరశలయ్యాయి. అత్తవారింటికి వచ్చిన నాటి నుంచి పుష్పాంజలి పై వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలో పుష్పాంజలి గర్భం దాల్చింది. అయినా కూడా భర్త అత్తమామలు వరకట్నం కోసం ఆమెను వేధిస్తూ ఉండేవారు. ఏడు నెలలు గర్భవతిగా ఉన్న పుష్పాంజలినీ ఇటీవల శనివారం సాయంత్రం భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధించి ఆమెపై దాడి చేశారు. పుష్పాంజలి ని తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఏడు నెలల గర్భంతో ఉన్న కూతురికి శ్రీమంతం చేసే పుట్టింటికి తీసుకెళ్దామని ఆశగా వచ్చిన తల్లిదండ్రులు కూతురు అలా శవంగా కనిపించడంతో ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు. బాధితురాలి తల్లిదండ్రులు పుష్పాంజలి అత్తింటి వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పుష్పాంజలి భర్త ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.