Crime News: కుటుంబ కలహాల వల్ల నెలల వయసున్న చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య..!

Crime News: ఆస్తి తగాదాలు,కుటుంబకలహాలు, పాత కక్షలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రతి రోజు ఎంతో మంది హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో ఇటువంటి విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన మహిళ నెలల వయసున్న చిన్నారితో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు జిల్లాలోని డోన్ మండలం, ఉడుములపాడు గ్రామానికి చెందిన మహిళ కుటుంబ కలహాల కారణంగా కన్న బిడ్డతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కుటుంబ కలహాల వల్ల అభం శుభం తెలియని నెలల వయసున్న చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సోమవారం ఉదయం ఇంటివద్ద సదరు మహిళ, బిడ్డ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వారి కోసం చుట్టుపక్కల గాలించారు. బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసిన ఎటువంటి ప్రయోజనం లేకపోయింది.

మహిళ కోసం బంధువులు గ్రామం మొత్తం వెతుకుతున్న తరుణంలో చెరువు సమీపంలో ఉన్న బావిలో ఇద్దరు శవమై కనిపించారు. గ్రామస్తులు సహాయంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్య గురించి ఆరా తీయగా మిత్రులు ఎవరు స్పందించకపోవడంతో అనుమానాలు కలిగిస్తున్నాయి అని పోలీసులు వెల్లడించారు. భర్త వేధింపులు భరించలేక సదరు మహిళ ఆత్మహత్య చేసుకుందా?లేక వేరే ఏ ఇతర కారణాల వల్ల ఆయన ఈ దారుణానికి ఒడిగట్టిన అన్న విషయాల గురించి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.