సోలోగా వ‌స్తున్న అఖిల్‌.. ఈ సారైన హిట్ కొడ‌తాడా!

అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్‌ హిట్ కోసం తెగ తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడు. తొలి చిత్రం అఖిల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని హీరో ఆ త‌ర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు చేశాడు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌ర‌చ‌డంతో బొమ్మ‌రిల్లు బాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమాపై ఫుల్ హోప్స్ పెట్టుకున్నాడు. అంద‌మైన రొమాంటిక్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో మోస్ట్ స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఇప్పుడు అఖిల్‌తో మూవీని చాలా అందంగా చిత్రీక‌రించిన‌ట్టు తెలుస్తుంది.

ఆ మ‌ధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇందులో అఖిల్, పూజా హెగ్డే తమ టైమింగ్‌తో అదరగొట్టారు. టీజర్‌ను బట్టి చూస్తే.. లవ్, ఫ్యామిలీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఉండనుంది. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా రిలీజ్ డేట్ పోస్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని కన్‌ఫాం చేశారు. పూజా హెగ్డే ఇందులో అఖిల్ కు జోడీగా నటిస్తుంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బిజినెస్ కూడా బాగానే చేస్తుంది.

స్టైలీష్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన కొత్త సినిమా ఉండనుందని అఖిల్ ఆ మ‌ధ్య ప్రకటించాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. చిరంజీవితో సైరా నరసింహా రెడ్డితో అనే బ్లాక్ బస్టర్ తెర‌కెక్కించిన‌ సురేందర్ రెడ్డి ఇప్పుడు అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందించ‌నున్నాడు. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంటుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.