Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్యకు పాల్పడిన మైనర్ ప్రేమ జంట!

Suicide:సాధారణంగా ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో పుడుతుంది. అయితే ఇలా ప్రేమలో పడినవారు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోగా మరికొందరు వారి ప్రేమకు తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారని ఆ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకోలేక ఆత్మహత్యనే శరణ్యమని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఇలా ఎంతో మంది యువతీ యువకులు ప్రేమలో పడి పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో ఒకటి చోటు చేసుకుంది.

వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని సొన్నాంకుప్పం గ్రామానికి చెందిన సుధాకర్‌ కుమార్తె త్రిష (16), అదే ప్రాంతానికి చెందిన యశ్వంత్ (18) వీరిద్దరు గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్నారు.అయితే వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో దీంతో మనస్తాపం చెందిన ఈ జంట మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే బుధవారం వేకువజామున ఈ జంట గుడియాత్తం సమీపంలోని కావనూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపైకి వెళ్లారు.

ఆ సమయంలో చెన్నై నుంచి జోలార్‌పేట వైపు వస్తున్న ఎలగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీ కొనడంతో ఈ ప్రేమజంట అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ విషయం గమనించిన లోకో పైలట్ జోలార్ పేట రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.ఈ క్రమంలోనే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.