భర్త చైతన్యతో కలిసి ట్రావెల్ షో చేస్తున్న మెగా డాటర్..?

మెగా డాటర్ నిహారిక గత కొన్ని రోజుల క్రితం పబ్ వ్యవహారం కారణంగా పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారని పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ పబ్ వ్యవహారం కారణంగా ఎంతోమంది మెగా కుటుంబం పరువు తీస్తున్నారు అంటూ ఆమెను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు.మెగా కుటుంబం తనపై కఠినమైన ఆంక్షలు విధించడం వల్లే నిహారిక సోషల్ మీడియాకు దూరంగా ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నిహారిక సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇన్ని రోజుల పాటు నిహారిక సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి కారణం ఉంది అని ప్రస్తుతం తెలుస్తోంది.

నిహారిక ఎప్పటినుంచో ఒక ట్రావెల్ షో చేయాలని ఆరాటపడుతున్నారు. అయితే ఇలా ట్రావెల్ షో చేయాలంటే ఎంతో శ్రమ డబ్బు ఖర్చుతో కూడుకున్నది కావడంతో నిహారిక అంత పెద్ద సాహసం చేయలేకపోయింది. అయితే తాజాగా తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య సహకారం లభించడంతో తన భర్తతో కలిసి ట్రావెల్ షో చేస్తుందని తెలుస్తోంది. నిహారిక తన భర్త చైతన్య జోర్డాన్ వెకేషన్ ఆస్వాదిస్తోన్న ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి.క్యూట్ కపుల్స్ చాపర్ లో ఇలా ప్రయాణం చేస్తూ కనిపిస్తున్నారు.

అయితే ఈ ఫోటోలను చూస్తుంటే నిజంగానే నిహారిక ట్రావెల్ షో చేస్తున్నారని తెలుస్తుంది. ఇక వీరితో పాటు కెమెరామెన్,ఇతర సిబ్బందిని సైతం వెంట తీసుకుని వెళ్లారని తెలుస్తోంది. ఈ విధంగా వీరు చేసిన ఈ ట్రావెల్ షోని ఒక డాక్యుమెంటరీ రూపంలో పొందుపరిచి దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ ట్రావెల్ షో ఇంగ్లీష్ లో ఒక జాతీయ టీవీలో ప్రసారం చేయనున్నారు. ఇక తెలుగులో ఈ ట్రావెల్ షోను ఓటీటీ ద్వారా ప్రసారం చేస్తారని సమాచారం.అయితే నిహారిక ట్రావెల్ షో గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే ఈ వార్తల పై మెగా బ్రదర్ నాగబాబు లేదా నిహారిక స్పందించాల్సి ఉంది.