Manchu Lakshmi: నిర్మాతల కన్న వాళ్ళు బతుకే నయం.. మంచు లక్ష్మి పోస్ట్ వైరల్!

Manchu Lakshmi: మంచు లక్ష్మీ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలు, టీవీ షోలలో నటించి నటిగా గుర్తింపు పొందడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా మంచులక్ష్మి ఎలాంటి ట్వీట్ చేసిన నెటిజన్లు దానిని భూతద్దంలో పెట్టి చూసి ఎన్నో అర్థాలు తీస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మంచు లక్ష్మి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎంతో మంది నెటిజన్ల ట్రోలింగ్ కి గురైంది.ఈ సందర్భంగా నిర్మాత గురించి మాట్లాడుతూ వారు ఒక సినిమాని నిర్మించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది అని తెలియజేశారు.

సినిమా చేయాలంటే ఎంతో నైపుణ్యం, ఉండాలి. ప్రతి ఒక్కరిని మేనేజ్ చేస్తూ, యుగో, నిర్లక్ష్యం అన్ని వదిలి పెట్టాలి. నిర్మాతలు వీటన్నిటినీ ఎదుర్కోవడానికి ఎంతో సమర్థవంతంగా ఉండాలి. ఇలా నిర్మాతల కష్టాలు ఎన్నో ఉంటాయి. నిర్మాతల కన్నా యాక్టర్స్ బ్రతుకే సో బెటర్ అంటూ మంచు లక్ష్మి నిర్మాతల కష్టాలను వెల్లడించారు. ఇక ఈమె ఈ పోస్ట్ చేయడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ పోస్ట్ పై స్పందిస్తూ అసలు మీ సమస్య ఏంటి ప్రశ్నిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.