Crime News: ప్రకాశం జిల్లాలో దారుణం.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రంపపు కొడవలితో దాడి..!

Crime News: ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య మానవత్వం మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. క్షణికావేశంలో ఎదుటి వారిని హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తీరా వారి తప్పు తెలుసుకునే లోపు జైలు పాలవుతున్నారు. వారి అందమైన జీవితాన్ని అంధకారం చేసుకుని జైలు ఊసలు లెక్కపెడుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దారుణంగా రంపపు కొడవలితో కొట్టి చంపాడు.

ప్రకాశం జిల్లా,బెస్తవారిపేట కు చెందిన శ్రీనివాసరెడ్డికి కూలి పనులకు వచ్చే ఒక మహిళ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త చనువుగా మారి వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఇదివరకే సదరు మహిళకు శ్రీనాథ్ రెడ్డి అనే మరొక వ్యక్తితో ఎనిమిది నెలలుగా వివాహేతర సంబంధం ఉంది. వీరి విషయం తెలుసుకున్న శ్రీనాథ్ రెడ్డి మహిళలను శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు వెళ్ళకుండా ఆపాడు.మహిళ తన దగ్గరకు రాకుండా అడ్డుపడుతున్నాడని శ్రీనాథ్ రెడ్డి మీద కక్ష పెంచుకుని, అతని ఆడు తొలగించుకోవాలి అని శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించుకున్నాడు.

శ్రీనివాస్ రెడ్డి పక్క పథకం రచించుకొని మొక్కజొన్న పొలంలో నీరు పెడుతున్న శ్రీనాథ్ రెడ్డి తల మీద రంపపు కొడవలితో దాడి చేశాడు. శ్రీనాథ్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న శ్రీనాథ్ రెడ్డి బందువులు, సన్నితులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. అన్యాయంగా శ్రీనాథ్ రెడ్డి ని హత్య చేశాడని రోదించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి, కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం హత్య చేసిన నిదితుడిని అరెస్ట్ చేశారు. తక్కువ సమయంలో హత్య కేసు ఛేజించిన వారిని ఎస్పీ అభినందించారు.