ప్రభాస్ “సలార్” పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన మలయాళ స్టార్ హీరో.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ప్రస్తుతం సెట్స్ పై ఉన్నవి అలాగే ఆల్రడీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉన్న చిత్రాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిలో పాన్ ఇండియా స్థాయిలో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్నా భారీ చిత్రం ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా.. 

ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో అయినటువంటి పృద్వి రాజ్ కూడా నటిస్తున్నాడని ఓ టాక్ ఆ మధ్య బయటకి వచ్చింది. దీనితో ప్రభాస్ తో పాటుగా ఈ నటుడుని కూడా ఈ సినిమాలో చూడడం అనేది మంచి ఎగ్జైటింగ్ గా అందరిలో అనిపించింది. అయితే దీనిపై ఇప్పుడు ఈ స్టార్ హీరో స్పందించడం ఆసక్తిగా మారింది. 

తాను సలార్ లో నటించడానికి రెడీనే అని కానీ అప్పట్లో ఇంకా కేజీఎఫ్ 2 కన్నా ముందే నాకు నీల్ కథ చెప్పడానికి అప్పటికి నేను ఓకే కూడా చేశాను కానీ తర్వాత కరోనా రావడం లాక్ డౌన్ వల్ల ఇక డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నేను సినిమాలో చేయలేకపోయానని చెప్పాడు. 

అంతే కాకుండా ప్రభాస్ తో సినిమా అంటే చెయ్యకుండా ఉండను ఇప్పుడు డేట్స్ సెట్ అయ్యేలా కనిపిస్తున్నాయి కుదిరితే డెఫినెట్ గా చేసే అవకాశం ఉందని తాను లేటెస్ట్ గా ఇచ్చిన ప్రెస్ మీట్ లో తెలిపాడు.