పాన్ ఇండియా లెవెల్ లోకి అఖండ 2 ప్లాన్ చేసిన మేకర్స్.. విడుదల అయ్యేది అప్పుడే?

బోయపాటి శీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం అఖండ. ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా కరోనా సమయంలో థియేటర్లలో విడుదలైన 100 రోజులు ఆడిన మొదటి సినిమాగా అఖండ కొత్త రికార్డులు సృష్టించింది. అఖండ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాలో బాలకృష్ణ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం అఖండ 2 సినిమా గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించబోతున్నారు. అఖండ సినిమాలో నటించిన అందరు ఈ సినిమాలో నటిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ అఖండ 2 సినిమాని 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి ఎక్కువగా అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. యదార్ధ సంఘటనల ఆధారంగా కొందరు రాజకీయ నేతలను టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందువల్ల ఈ సినిమా 2024 లో ఎలక్షన్స్ కి ముందు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇక ప్రస్తుతం రామ్ పోతినేని నటిస్తున్న సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నాడు. రామ్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత అఖండ 2 సినిమా పనులు మొదలవునున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అఖండ సినిమా నిర్మాత మిరియాల రెడ్డి కూడా తన బావను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరోగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అఖండ 2 సినిమా పనులు ప్రారంభం కావటానికి చాలా సమయం పడుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి హల్ చల్ చేస్తున్న వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే అఖండ సినిమా బృందంలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.