పెద్ద గొడవ తర్వాత ప్రభాస్ సినిమాలో ఇంకో పాట కూడ

Makers decide to shoot another song for Radhe Shyam
Makers decide to shoot another song for Radhe Shyam
 
ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం ఆరంభం నుండి ఒడిదుడుకుల్లోనే సాగుతోంది. గత లాక్ డౌన్ ముందు మొదలై ఇంకా బ్యాలెన్స్ ఉంది.  అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువే అయింది. షూటింగ్ కోసం చాలా సమయమే పట్టింది. సినిమా పూర్తిస్థాయి లవ్ స్టోరీ. అందుకే యాక్షన్ ప్రేమికుల్లో సినిమా మీద అంత ఆసక్తి లేదు.  సినిమాలో కథ గొప్పగా ఉంటే తప్ప హిట్ అవ్వడం కష్టం. ఏదో సాదాసీదా కథ అయితే మాత్రం రిజల్ట్ తేడా కొట్టొచ్చు.  అవన్నీ పక్కనపెడితే సినిమాలో ఒక పాట గురుంచి నిర్మాతల నడుమ పెద్ద చర్చే జరిగిందట. 
 
ఈ సినిమా గోపికృష్ణ మూవీస్, టీ-సిరీస్ కలిసి నిర్మిస్తున్నారు.  షూటింగ్ పరంగా ఒక సాంగ్, కాస్త ప్యాచ్ వర్క్ ఉంది. ఇప్పటికే ఖర్చు ఎక్కువ కావడం, ఇంకా టైమ్ పట్టేలా ఉండటంతో ఆ పాటను తీసేద్దామని టీమ్ అంటుంటే టీ సిరీస్ నిర్మాతలు మాత్రం పాట తీయాల్సిందేనని పట్టుబట్టారట. ఆ పాట మూలాన బిజినెస్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉందనేది వారి వాదన. సుదీర్ఘమైన వాదోపవాదాల తర్వాత టీ సిరీస్ వాదనే నెగ్గింది. ఆలస్యమైనా పాటను షూట్ చేయాల్సిందేనిని నిర్ణయించారు టీమ్. దీంతో లాక్ డౌన్ ఎత్తివేసి షూటింగ్ మొదలైన కూడ ఒక మూడు వారాల పని ఉంటుందని తెలుస్తోంది.