Mahesh babu : రాధేశ్యామ్ చిత్రం పై స్పందించిన మహేష్… బాక్సాఫీస్ సౌండ్ అదిరిపోయింది అంటూ కామెంట్!

Mahesh babu : ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా మార్చి 11 న విడుదలయి మంచి స్పందనతో దూసుకుపోతోంది. ప్రభాస్ నటన, పూజ నటన సినిమా విజుల్స్ పై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొంత మంది సినిమా చాలా నెమ్మదిగా ఉందంటు కామెంట్స్ చేసిన సినిమా కలెక్షన్స్ పై ఆ ప్రభావం పడలేదు.సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీస్ కూడా సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూశారు.ఇక సినిమా విడుదల తర్వాత సెలబ్రిటీలు కూడా సినిమా చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

రాజమౌళి తన కుటుంబసభ్యులతో కలిసి సినిమా చూస్తున్న ఫోటోను షేర్ చేసారు. ఇక థమన్ అయితే సినిమాపై నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నవారిపై మీమ్ తో స్పందించారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాధే శ్యామ్ సినిమాను తన కుటుంబంతో కలిసి చూసారు. ఇక సినిమా పై ఆయన స్పందించారు.

అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేస్తూ.. ‘రాధేశ్యామ్’ తిరుగులేని విజయం అందుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు. నిజంగా ఇది ప్రభాస్ స్టార్ డమ్ కి కొలమానమే. అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ఫైనల్ గా బాక్సాఫీస్ సౌండ్ అదిరిపోయింది’ అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక ‘రాధేశ్యామ్’ సినిమాకి జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించిన మ్యూజిక్ కూడా టాప్ లో ఉందని.. దర్శకుడు రాధాకృష్ణ మిగతా టీమ్ అద్భుతంగా పని చేశారు అని.. ముఖ్యంగా జగపతిబాబు గారు కూడా అద్భుతంగా నటించారని మహేష్ చెప్పుకొచ్చాడు.

ఇక రాధే శ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ప్రభాస్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని ప్రభాస్ నిరూపించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు