మహేష్ బాబు ఎలాంటి గ్యాప్ తీసుకోడట.!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ ఆ దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే అదిరే మాస్ మసాలా ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొలుకున్న ఈ సినిమా ఇప్పుడు స్పెయిన్ దేశంలో కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంటుంది. అయితే వచ్చే నవంబర్ వరకు కూడా మహేష్ సర్కారు వారి పాట షూట్ తోనే బిజీ బిజీగా ఉంటుండగా మరో ఆసక్తికర సమాచారం ఇప్పుడు వినిపిస్తుంది.

దీని తర్వాత మహేష్ మరో స్టార్ దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. కానీ ఈ సినిమాకి మాత్రం మహేష్ పెద్దగా గ్యాప్ తీసుకోకబోతున్నట్టుగా తెలుస్తుంది. సర్కారు వారి పాట ఫినిష్ అయ్యిన మరుక్షణం కంప్లీట్ ఫోకస్ త్రివిక్రమ్ సినిమాపై మహేష్ పెట్టనున్నాడట. అలాగే ఇది కూడా కంప్లీట్ చేసేశాక రాజమౌళి సినిమా కోసం మహేష్ తనని తాను పూర్తిగా సిద్ధం చేసుకోవాలని అనుకుంటున్నట్టు టాక్. మొత్తానికి మాత్రం మునుపటిలా మహేష్ నుంచి లాంగ్ బ్రేక్స్ అయితే మళ్ళీ మనం చూడం అని చెప్పాలి.