
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక నిర్మాణ సంస్థను స్థాపించి అందులో చిన్న సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ హీరోలు, దర్శకులను తీసుకొచ్చి కొత్త కాంబినేషన్లు సెట్ చేస్తున్నారు. ఇప్పటికే అడివి శేష్ హీరోగా ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆయన ఇప్పుడు ఇంకో కొత్త హీరోతో సినిమాను రూపొందించనున్నారు. అతనే నవీన్ పోలిశెట్టి. ఇటీవల విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాతో నవీన్ గ్రాండ్ హిట్ అందుకున్నారు. అతని నుండి రాబోయే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నవీన్ కూడ పలు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేశారు.
వాటిలో మహేష్ బాబు నిర్మాణ సంస్థలో ఒక చిత్రం ఉంది. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా అనేది ఇన్నాళ్లు సస్పెన్స్ అన్నట్టే నడిచినా ఇప్పుడు మాత్రం ఒక పేరు గట్టిగా వినబడుతోంది. అదే వెంకీ కుడుములు. ‘ఛలో, భీష్మ’ సినిమాతో వెంకీ కుడుముల మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే అతనైతే బాగుంటుందని అవకాశం ఇచ్చారట మహేష్. ఈ చిత్రం కూడ రొమాంటిక్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఇతర వివరాలు ఏమిటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
