బ్రేకింగ్ : విజయవాడ దుర్గ గుడి వద్ద ప్రమాదం.. విరిగిపడిన కొండచరియలు

landslides at vijayawada indrakeeladri

విజయవాడ దుర్గ గుడికి సమీపంలో ఇంద్రకీలాద్రిపై ప్రమాదం జరిగింది. భారీ వర్షాల వల్ల ఇంద్రకీలాద్రి మీద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

landslides at vijayawada indrakeeladri
landslides at vijayawada indrakeeladri

వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? అనే విషయంపై క్లారిటీ లేదు. వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. కొండచరియలు విరిగిపడటం వల్ల అక్కడ పని చేస్తున్న ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. 

కొండ చరియలు విరిగిపడటం వల్ల అక్కడే ఉన్న రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. అయితే.. ఇవాళ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించడానికి సీఎం జగన్ కాసేపట్లో దుర్గ గుడికి రానున్న నేపథ్యంలో.. అక్కడ రాకపోకలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది.