మూగ జీవిని క‌ర్ర‌లు, గొడ్డ‌లితో చంపిన యువ‌కులు.. వీళ్ళు మార‌రా అంటూ సీనియ‌ర్ న‌టి కామెంట్

కొన్ని సార్లు మ‌నుషులు మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. మూగ జీవుల ప‌ట్ల విజ్ఞ‌త లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అత్యంత దారుణంగా వాటిని హింసిస్తూ రాక్ష‌సుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. రోజుకు ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రుగుతున్నాయి. వీటిప‌ట్ల సెల‌బ్రిటీలు స్పందిస్తూ కొద్దిగా మాన‌వ‌త్వంతో మెల‌గండి, మూగ‌జీవాల‌ను హింసించొద్దు అని వేడుకున్నా కూడా అలానే ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆ మ‌ధ్య కేరళ రాష్ట్రంలో ఏనుగు మృతి , ఆ త‌ర్వాత ఆవు గాయప‌డ‌డం సంచ‌ల‌నం రేపాయి.

గర్భంతో ఉన్న గజరాజుకు పైనాపిల్ ఆశ చూపిన‌ కొందరు యువకులు అందులో ట‌పాసులు నింపారు. పండు అని ఆశ‌గా తినే క్ర‌మంలో అది పేల‌డంతో గ‌జ‌రాజు గిలిగిల‌లాడింది. అలాంటి సంఘ‌ట‌న ఓ ఆవు విష‌యంలోను జ‌రిగింది.ఈ ఘ‌ట‌న‌లు ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో క‌లిచి వేశాయి. టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్ సెల‌బ్రిటీలు ఎప్పటిక‌ప్పుడు మూగ‌జీవాల‌పై ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు విచ‌క్ష‌ణారాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

తాజాగా జరిగిన ఘ‌ట‌న ఒక‌టి న‌టి ఖుష్బూని ఎంత‌గానో భాదించింది. వీడియో షేర్ చేసిన సీనియర్ నటి కుష్బూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్త‌ర‌ప్రదేశ్ రాష్ట్రంలో కొంద‌రు యువ‌కులు డాల్ఫిన్‌ని క‌ర్ర‌లు, గొడ్డ‌లితో కొట్టి చంపారు. ఈ వీడియో వైర‌ల్ కాగా, ఇది చూసిన వారంద‌రు చాలా బాధ‌ప‌డ్డారు. మూగ‌జీవిపై మ‌నం ప్ర‌వ‌ర్తించే తీరు ఇదేనా అని మండిప‌డ్డారు. ఖుష్బూ ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. భ‌యంక‌రం.. వీళ్ళు మార‌రా అంటూ కామెంట్ పెట్టింది. ఎంత మంది చెప్పిన మూగ‌జీవాల‌పై కొంద‌రు ప్ర‌వ‌ర్తించే తీరు ఆందోళ‌న క‌లిగిస్తుంది.