Corona: సింగర్ కౌసల్యకి కరోనా పాజిటివ్.. బెడ్ మీద నుంచి లేవలేకపోతున్న.. అంటూ పోస్ట్..!

Corona: ప్రస్తుతం దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా వాటి రూపాలను మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేస్తోంది.ఇప్పటికే ఈ మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ మునుపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యులు, ప్రముఖులు అని భేదం లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సినీ పరిశ్రమలో కూడా చాలామంది ఇప్పటికే కరోనా నుండి కోలుకున్నారు. మొదటి వేవ్ నుండి ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో కరోనా కారణంగా చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇటీవల మంచు లక్ష్మీ ప్రసన్న, మహేష్ బాబు వంటి ప్రముఖులు కరోనా నుండి కోలుకున్నారు. బాలీవుడ్ ,టాలీవుడ్ అంటూ భేదం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో కరోనా వ్యాప్తి చెందుతోంది. తాజాగా టాలీవుడ్ సింగర్ కౌసల్య కూడా కరోనా బారిన పడ్డారు.

ప్రముఖ గాయని కౌసల్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆవిడ కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కౌసల్య షేర్ చేసుకున్నారు. “నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల బెడ్ మీద నుంచి లేవలేక పోతున్నాను. రెండు రోజులుగా జ్వరం ఎక్కువగా ఉంది .ఇప్పుడు గొంతు నొప్పి కూడా మొదలయింది. ఇప్పుడు టాబ్లెట్స్ వాడటం మొదలుపెట్టాను. త్వరలోనే కరోనా నుండి కోలుకొని మీ ముందుకు వస్తాను. అందరూ జాగ్రత్తగా ఉండండి” అంటూ ఇన్స్టాగ్రామ్ లో కౌసల్య పోస్ట్ చేశారు.

విషయం తెలుసుకున్న అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు ఆవిడ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆవిడకు కామెంట్లు పెడుతున్నారు. దేశంలో కరోనా కేసులు మొదలయినప్పటి నుండి సినీ ఇండస్ట్రీ మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరో ఒకరు కరోనా వల్ల ఇబ్బంది పడుతూనే ఉన్నారు.