ఐటీ ఉద్యోగాలు ఇవ్వరు.. కనీసం పని అయినా చేసుకోనివ్వండి: చంద్రబాబు నాయుడు

NCBN

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాజాగా ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు నిలిపి వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికి వారం రోజులు కావటంతో తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు.

కశ్మీర్ లో వినిపించే ఇంటర్నెట్ సేవల నిలిపివేత.. ఇక్కడ వినాల్సి రావడం చాలా బాధాకరమని అన్నారు. ఐటి ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం వారికి ఇంటర్నెట్ అందించక వాళ్లు పని చేసుకునే వెసులుబాటు లేకుండా చేయడం దారుణమని అన్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది అని.. ఈ రోజుల్లో ఇటువంటి సేవలు నిలిపి వేయడం సరికాదని అన్నారు.