Janhvi Kapoor: తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. అయితే జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ ,ఎన్టీఆర్ కూడా వారి తదుపరి సినిమాలపై దృష్టి సారించినట్లు ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా ఆచార్య సినిమా పూర్తిచేసుకొని శంకర్ సినిమాతో బిజీ అయ్యారు.
ఇక ఎన్టీఆర్ కూడా తన తదుపరి చిత్రాల పై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో తారక్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాకు హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
అదే నిజమైతే ఎన్టీఆర్ జాన్వి కపూర్ కెమిస్ట్రీ వెండితెర మీద ఫాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా పూర్తి చేసిన అనంతరం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాలో చేయనున్నట్లు తెలుస్తోంది.2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎన్టీఆర్ కూడా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
