ఏపీ సీఎంతో జక్కన్న బేటీ.. ఎందుకంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో బేటీ కావటానికి ఏర్పాటు చేయనున్నాడు. కారణం.. జక్కన్న దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉండటంతో.. ఈ విషయం గురించి జక్కన్న జగన్ మోహన్ రెడ్డి ని కలవాలని అనుకుంటున్నట్లు తెలిసింది.

ఆయనతో పాటు ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య కూడా జగన్ ను కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇక ఇటీవలే జగన్ ఆంధ్ర ప్రదేశ్ సినిమా టికెట్ల విషయంలో సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరి భేటీ తర్వాత అసలు విషయాలు ఏంటో తెలవనున్నాయి.