Jagapathi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో పైసా ఉంటేనే పట్టించుకుంటారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన జగ్గు భాయ్..!

Jagapathi Babu: ప్రస్తుతం టాలీవుడ్ లో జగ్గు భాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో జోరుగా ముందుకు సాగిపోతున్నారు. నెగిటివ్ రోల్స్ పాజిటివ్ రోల్ అంటూ తేడా లేకుండా అన్ని పాత్రలను పోషిస్తూ ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా జగపతిబాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. తర్వాత కొంతకాలం ఆయన కెరీర్ అదుపుతప్పి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిర్మాతగా కూడా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ నష్టాలనే మిగిల్చింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఆయన బిజీగా ఉంటున్నారు. 30 ఏళ్ల తన సినీ ప్రయాణంలో తనకంటూ ఇండస్ట్రీ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు అంటే నమ్మలేకపోతున్నాము. కానీ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ సినిమా లో జగపతి బాబు విలన్ క్యారెక్టర్ లో నటించారు. ఆ సినిమా వల్ల ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటినుండి జగపతిబాబు వరుసగా సపోర్టింగ్ రోల్స్, విలన్ క్యారెక్టర్లో కూడా నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. అరవింద సమేత, రంగస్థలం సినిమాలో జగపతి బాబు నటనకు మంచి గుర్తింపు లభించింది. 30 ఏళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన జగపతి బాబు గారు ఇండస్ట్రీలో చాలా క్రమశిక్షణతో ఉంటారు. “తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పైసా ఉంటేనే పలకరిస్తారు. ఇన్ని సంవత్సరాల తన సినీ జీవితంలో తనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి స్నేహితుడు కూడా లేడు, అందరూ పైపైకి మాత్రమే ప్రేమగా మాట్లాడి గుడ్ బై చెప్పే రకాలు” అని ఈ సందర్భంగా ఆయన భావాలు వ్యక్తపరిచాడు.

జగపతి బాబు జీవితంలో ఒక హీరోకు మాత్రమే తనతో మంచి అనుబంధం ఉందని ఆయన ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఒకప్పటి యాక్షన్ కింగ్ అర్జున్ అంటే జగపతిబాబుకి చాలా ఇష్టమట. వీరిద్దరూ తరచూ గొడవ పడుతూ ఉండేవారు. అయితే గొడవలన్నీ వారిద్దరి స్నేహబంధం లో భాగమేనని జగపతి బాబు తెలియజేశారు. అర్జున్ తో జగపతి బాబు కి మంచి స్నేహబంధం ఉండటం వల్లే ఆయనతో కలిసి జగపతిబాబు పలు సినిమాలలో నటించారు.