Jagan: చంద్రబాబుపై మండిపడ్డ జగన్.. ఏకంగా దుర్మార్గులు అంటూ..

Jagan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలు పార్టీల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య చాలా విమర్శలు ఎదురయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైయస్ జగన్ మండిపడ్డాడు.

సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం పై చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియా గోబెల్స్ ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యాడు. ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసం అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని అన్నాడు. అంతేకాకుండా రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామని వ్యాఖ్యానించాడు జగన్. ఇక తమ ప్రభుత్వం వద్దని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు చెబుతున్నాడు అని మరి కొన్ని వ్యాఖ్యలు చేశాడు జగన్.