House Wife: పెళ్లి అయ్యి ఆరేళ్ళవుతున్న పిల్లల కలగలేదని ఈ మహిళ తీసుకున్న నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

House Wife: పెళ్లి అయిన తర్వాత ప్రతి ఒక్క మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. అయితే కొందరికి పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడితే మరికొందరికి కాస్త ఆలస్యంగా సంతాన సౌభాగ్యం కలుగుతుంది.ఈ క్రమంలోనే ఎంతోమంది వారికి పిల్లల కలగలేదని మానసిక వేదనకు గురి అవుతూ క్షణికావేశంలో ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎంతోమంది వంద సంవత్సరాలు గడపాల్సిన జీవితానికి మధ్యలోనే ముగింపు పలుకుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే…

దేవనహళ్లిలోని శాంతినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని జ్యోతి బసవరాజ్ అనే జంట నివసించేవారు.అయితే వీరిద్దరూ గత ఆదివారం నుంచి కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.ఈ క్రమంలోనే వారు నివసిస్తున్న ఇంటిని పరిశీలించగా ఇంటి నుంచి చెడు వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుని కొన్ని రోజులు అయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించగా అసలు విషయం బయటపడింది.

నిజానికి వారిద్దరు భార్యాభర్తలు కాదని పోలీసుల విచారణలో వెల్లడైంది. జ్యోతికి ఇదివరకే రాము అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.ఈమె పెళ్లి జరిగి ఆరు సంవత్సరాలు అయిన వీరికి పిల్లల కాకపోవడంతో పిల్లల విషయంలో జ్యోతి ఎంతో అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ క్రమంలోనే టాక్సీ డ్రైవర్ గా పని చేసే బసవరాజుతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి తన భర్తను వదిలి ప్రియుడితో ఇల్లు వదిలి వచ్చేసింది.ఇలా ఇంటి నుంచి వచ్చిన ఈ జంట బెంగళూరులో భార్యాభర్తలమని చెప్పి నివాసం ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారని ఇరుగుపొరుగు వారు తెలియజేశారు.ఇంత అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.