సాయి ధరం తేజ్ ని మించి పోతున్న వైష్ణవ్ తేజ్..?

మెగా మేనల్లుడుగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మెగా మెనల్లుడు నటించిన డెబ్యూ సినిమా ఉప్పెన. కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నీ కన్ను నీలి సముద్రం అన్న పాట విపరీతంగా పాపులర్ అయింది.

Telugu Song 2020: Latest Telugu Video Song 'Nee Kannu Neeli Samudram' from  'Uppena' Ft. Panja Vaisshnav Tej and Krithi Shetty (Lyrical) | Telugu Video  Songs - Times of India

అయితే డెబ్యూ సినిమా కావడంతో మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఇష్టపడలేదు. కాగా వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీటయిందట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక క్రిష్ వైష్ణవ్ ని ఈ సినిమా లో విలేజ్ కుర్రాడిగా చూపిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు వైష్ణవ్ డెడికేషన్ తెగ నచ్చేసిందట. మరోసారి మెగా హీరోలు సినిమాకోసం ప్రాణం పెడతారన్న విషయం ప్రూవ్ చేశాడని అంటున్నాడట.

Krish Launches His Film With Vaishnav Tej

అందుకే వైష్ణవ్ కి క్రిష్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు.. ఎలాంటి కథ లు ఎంచుకోవాలో… ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలో సలహాలిస్తున్నాడట. దాంతో ఇప్పటికే కొన్ని క్రేజీ బ్యానర్స్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. కాగా ఇప్పటికే క్రిష్ సినిమా కాకుండా మరో రెండు సినిమాలని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మూడవ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుందని ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలో వెల్లడి కానుందని సమాచారం. మొత్తానికి ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ అన్న కంటే ఫాస్ట్ గా దూసుకుపోతున్నాడు.