నిహారిక పెళ్ళి తర్వాత నిర్మాతగా మారటానికి కారణం అదేనా..?

మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట బుల్లితెర మీద యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక ఒక్క షో తోనే యాంకర్స్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తిగా నిహారిక రికార్డ్ క్రియేట్ చేసింది. మెగా కుటుంబం నుండి నిహారిక తప్ప ఎవరూ హీరోయిన్స్ గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టలేదు. హీరోయిన్ గా నిహారిక నటించిన ఒక మనసు,సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలు హిట్ కాలేకపోయాయి. దీంతో ఈ అమ్మడు సినిమాలకి కొంత కాలం దూరంగా ఉంది.

ఇదిలా ఉండగా 9 డిసెంబర్ 2020 లో జొన్నలగడ్డ చైతన్య ని వివాహం చేసుకున్న నిహారిక పూర్తిగా సినిమాలు దూరమయ్యింది. నిహారిక హీరోయిన్ గా నటించటం తన భర్తకి ఇష్టం లేకపోవటం వల్ల నిహారిక ఇండస్ట్రీ కి దూరమయ్యిందని సమాచారం. అయితే నిహారిక సినిమాలకి దూరమైన కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అభిమానులతో టచ్ తో ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా నిహారిక హీరోయిన్ గా నటించటం తన భర్తకి ఇష్టం లేకపోవడంతో వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారింది. నిహారిక ఇలా నిర్మాతగా మారటానికి కారణం మాత్రం తన భర్త అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఈ మధ్యకాలంలో నిహారిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే ఫోటోలు మాత్రం చాలా గ్లామరస్ గా ఉంటున్నాయి. కొన్ని సందర్భాలలో నీహారిక షేర్ చేసే ఫోటోలు వల్ల ఆమె విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే కొందరు మాత్రం సోషల్ మీడియాలో నిహారిక దూకుడు చూస్తుంటే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ గా కాకపోయినా పలు కీలక పాత్రల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక ఇలా ఒక వైపు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మాత్రమే కాకుండా నటిగా కూడా రాణించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.