కలర్స్ స్వాతి చేసిన అతి పెద్ద తప్పు అదేనా?

స్వాతి కంటే ‘కలర్స్’ స్వాతి గా బాగా పాపులర్ అయ్యింది స్వాతి. మా టీవీ లో  ‘కలర్స్’ అనే పోగ్రామ్ తో ఎంట్రీ ఇచ్చి, మంచి క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో స్వాతి అంటే చాలా మంది పడి చచ్చిపోయేవారు. అతి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ అందుకున్న స్వాతి కృష్ణ వంశీ ‘డేంజర్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత వెంకటేష్, త్రిష నటించిన ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ సినిమాలో త్రిష చెల్లింగా నటించింది.

తర్వాత  నాని ‘అష్టాచమ్మా’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. స్వాతి చేసిన మొదటి సినిమాతోనే హీరోయిన్ గా ఫిలింఫేర్ అవార్డ్, నంది అవార్డ్ ని సొంతం చేసుకుంది. మొదటి సినిమానే ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందంటే ఆ హీరోయిన్ కు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు.

మొదటి సినిమా హిట్ తో స్వాతి కి చాలా ఆఫర్స్ వచ్చాయి. ఇక చేతినిండా అవకాశాలు స్టార్ హీరోయిన్ అయినట్లే అనుకుంటాం కానీ కలర్ స్వాతి జీవితంలో మాత్రం అలా కాలేదు. ఆ తర్వాత ‘గోల్కొండ హై స్కూల్’, ‘కార్తికేయ’, ‘స్వామిరారా’ వంటి మూవీస్ లో నటించింది కానీ అవి స్వాతి కెరీర్ కి ఏ మాత్రం ఉపయోగపడలేవు. దీనికి కారణం స్వాతి చేసిన ఒక చిన్న పొరబాటు.

హీరోయిన్ గా బాగా పాపులర్ ఐన రోజుల్లో ఎన్నో ఆఫర్స్ వచ్చినా చేతికి వచ్చిన వాటిని రిజెక్ట్ చేసిందట. అంతేకాకుండా తన అందం మీద సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన తనకు ఆఫర్స్ తగ్గాయి.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటేనే గ్లామర్ చూస్తారు. హీరోయిన్ ను చూసేది అందం కోసం, అలాంటి హీరోయిన్లు తమ అందాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు అందం అనే ఫార్ములాను పాటిస్తూ ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.. కానీ కలర్స్ స్వాతి మాత్రం దాన్ని లైట్ తీసుకుంది. దీంతో ఆమె తన గ్లామర్ పై కేర్ తీసుకోకపోవడంతో ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గి చివరికి ఇండస్ట్రీనే విడిచి వెళ్లి వివాహం చేసుకొని సెట్ అయిపోయింది కలర్స్ స్వాతి.