‘RRR’ బృందంకి ఏపీ ప్రభుత్వం నుంచి షాకింగ్ ఆర్డర్ వెళ్లిందా?


నిన్ననే భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) బృందం నుంచి ఊహించని విధంగా ఒక సంచలన స్టేట్మెంట్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తాము ఎలాంటి కోర్టుని ఆశ్రయించాలని అనుకోలేదని ఏపీలో టికెట్ ధరల సమస్యపై ఏపీ సీఎం తో చర్చలు చేసే పరిష్కారం చేస్తామని తెలిపారు. అయితే ఈ సమస్య సర్దుబాటు అవ్వడానికో లేక వేరే కారణాలు ఉన్నాయో కానీ ఓ ఊహించని టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ భారీ సినిమా కి సంబంధించిన రెండు ఈవెంట్స్ ని తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ప్లాన్ చేస్తున్నారట. అందులో విశాఖ జిల్లాలో జరిగే ఈవెంట్ కూడా ఒకటి అట. మరి దీనికే ఏపీ ముఖ్యమంత్రి ని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఏ కారణం గా జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఇది అటు ఏపీ ప్రభుత్వం నుంచి వెళ్లిన ఆర్డర్ ప్రకారం ఓ ప్రచారం లా జరుగుతుందా లేక వేరే ప్రయోజనాల కోసమా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా మాత్రం ఇదంతా ఏదో తేడా వ్యవహారం లాగే అనిపిస్తుంది.