Crime News: డేటింగ్ యాప్ ద్వారా యుతితో పరిచయం.. నమ్మించి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం…!

Crime News: ఈ మధ్యకాలంలో మహిళలు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కొందరు యువకులు స్నేహం, ప్రేమ పేరుతో మహిళలను నమ్మించి వారి మీద దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక యువతిని నమ్మించి రూమ్ కి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన ఇటీవల బెంగళూరులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… డేటింగ్ యాప్ ద్వారా యువతితో పరిచయం పెంచుకున్న యువకుడు ఆమెను నమ్మించి మోసం చేశాడు.బెంగళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తున్న యువతి డేటింగ్ యాప్ ద్వారా రజత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొంత కాలం తర్వాత వీరి స్నేహం ఫోన్ నంబర్లు మార్చుకునే వరకు వెళ్ళింది.రజత తన స్నేహితులతో కలిసి సంజయ్‌నగర్‌లోని ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఉన్న సాహిత్యంతో యువతీ యువకులు రెండు సార్లు కలుసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 24 వ తేదీన రజత్ ఆమెను రెస్టారెంట్ కు పిలిచాడు.

రెస్టారెంట్లో డిన్నర్ చేసిన అనంతరం యువతిని తన రూం కి తీసుకెళ్ళాడు.అక్కడికి వెళ్ళిన తర్వాత రజత్ తన స్నేహితులతో కలిసి యువతి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటనపై యువతి ఈనెల 25వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

పోలీసు కేసు గురించి తెలుసుకున్న ప రజత్ ఎలాగైనా అక్కడినుండి తప్పించుకోవాలని ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రజత్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించిన పోలీసులు మిగిలిన యువకులను కూడా వివిధ ప్రాంతాలలో అదుపులోకి తీసుకున్నారు.