మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. పవన్ కళ్యాణ్, చిరంజీవి కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కొన్ని నిమిషాల పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి కనిపించారు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఉన్న కుటుంబాలలో మెగా ఫ్యామిలీ ఒకటనే సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలంతా దాదాపుగా సక్సెస్ సాధించడం గమనార్హం.
చిరంజీవి తన సోదరులను కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడానికి ఎంతో కష్టపడ్డారు. చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో తన ఫ్యామిలీతో కలిసి చెన్నైలో నివాసం ఉండేవారు. కోడి రామకృష్ణ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని కొందరు లోకల్ గూండాలు ఆట పట్టించడం జరిగింది. చిరంజీవి ఆ కామెంట్లను పట్టించుకోకపోయినా పవన్ కళ్యాణ్ ఆ గూండాలతో గొడవ పడ్డారని సమాచారం.
గూండాలలోని ఒక వ్యక్తి గాయాలపాలై ఆస్పత్రిలో చేరడంతో చిరంజీవి పవన్ తరపున క్షమాపణలు కోరారని సమాచారం. పవన్ ఆ వ్యక్తి ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం తన వంతు సాయం చేశారని సమాచారం. తన కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య వస్తే స్పందించే విషయంలో పవన్ ముందువరసలో ఉంటారు. పవన్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
