టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు మాత్రమే సొంతమైన రికార్డ్ ఏంటో తెలుసా?

ఈతరం స్టార్ హీరోలలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అయితే ఎన్టీఆర్ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఆంధ్రావాలా సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

అయితే ఈ ఫ్లాప్ సినిమాతో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డులు క్రియేట్ చేశారు. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ ఇప్పటివరకు ఏ ఆడియో ఫంక్షన్ జరగని స్థాయిలో జరిగింది. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ కు ఏకంగా 10 లక్షల మంది హాజరయ్యారు. 10 ప్రత్యేక రైళ్లను ఇండియన్ రైల్వే ఈ ఆడియో ఫంక్షన్ కోసం కేటాయించడం అప్పట్లో సంచలనమైంది. చిన్న వయస్సులోనే తారక్ ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.

20 సంవత్సరాల వయస్సులోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఈ స్థాయిలో క్రేజ్ ఉంది. సింహాద్రి సినిమాతో తారక్ ఇండస్ట్రీ హిట్ సాధించడంతో పాటు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించింది. నిమ్మకూరులో ఈ ఆడియో ఫంక్షన్ జరగగా జనాలు ఊహించని స్థాయిలో ఇక్కడకు వచ్చారు. నిమ్మకూరు గ్రామంలో సామర్థ్యానికి మించి ఫ్యాన్స్ హాజరయ్యారు. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

ఈ వేడుకకు ఎన్టీఆర్ ను ఎంతో కష్టపడి స్టేజ్ పైకి తీసుకొచ్చారు. తన కోసం వచ్చిన అభిమానులను చూసి ఎన్టీఆర్ సైతం షాకయ్యారు. సినిమా చరిత్రలోనే ఇలాంటి ఫంక్షన్ ఎప్పుడూ జరగలేదని సమాచారం. మీడియా ప్రతినిధులు జనం వల్ల ఈ ఈవెంట్ ను కవర్ చేయలేకపోయారు. ఈ స్థాయిలో స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ భవిష్యత్తులో మరిన్ని సక్సెస్ లను అందుకుంటాడని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.